ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేపట్టిన 48 గంటల దీక్ష ముగిసింది.ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ఘాట్ విమర్శలు చేశారు.
ఇక కేసీఆర్ పని అయిపోయిందని, కేసీఆర్, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్పై విమర్శలు గుప్పించారు.తెలంగాణ అమరవీరుల త్యగాలను గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టీఆర్ ఎస్ నాయకులు దోచుకుంటున్నారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ పడిన కష్టం కంటే తెలంగాణ ప్రజలు ఎక్కువగానే ఇచ్చారని, ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని విమర్శించారు.
కేసీఆర్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిన సమయం వచ్చిందని, కేసీఆర్ ఆయన కుంటుబ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
కేసీఆర్ పుట్టిన తరువాతే మోసం అనే పదం పుట్టిందని, తెలంగాణ వస్తే ప్రజల కష్టాలు తొలిగిపోయి, సంతోషంగా ఉందామనుకుంటే కేసీఆర్ ప్రజల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ ను చూసి కేసీఆర్ ఫాంహౌస్ వదిలి పరుగులు పెడతున్నారని విమర్శించారు.
త్వరలోనే గజ్వేల్లో సమావేశం ఏర్పాటు చేసి అధికార పార్టీ ఆగడాలపై నీలదీస్తాం.
తాము అధికారంలోకి వస్తే ప్రగతిభవన్ ను అంబేద్కర్ బహుజన భవన్గా మార్చి కేసీఆర్ను తరిమికొడుతాం. దళిత, గిరిజన, బహుజన బిడ్డల కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం.తెలంగాణలోని పిల్లలను ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజినీర్లుగా మారుస్తాం.
కాంగ్రెస్ పార్టీలో కష్ట పడిన వారికి సముచిత స్థానం లభిస్తుంది.కాంగ్రెస్ అధిష్టానం ఎవరినైనా ముఖ్యమంత్రి చేయవొచ్చు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలలో గెలుపుతమదేనని అయ్యా అంటుంటే.కొడుకు మాత్రం ఓడితే పోయేదేమీ లేదంటున్నాడు.
మంత్రి మల్లారెడ్డి కుటుంబం మేడ్చల్ ను దోచుకుంటున్నారు.మేడ్చల్ ప్రాంతంలో భూములు అమ్మినా.
కొన్నామల్లారెడ్డికి కమీషన్లు ఇవ్వాలి.కబ్జాలతో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, ఇంజీనీరింగ్ కాలేజీలు, జవహనర్ నగర్ ఆస్ప్రతి, వర్సిటీ భూములపై విచారణ జరగాలి.