తెలంగాణ మట్టి మనదిరా.తెలుగుదేశంపార్టీ మనదిరా.
అనే నినాదంతో కొత్త తరంలో నాయకుల్ని తయారు చేసి టీడీపీ బలోపేతం చేయనున్నట్లు టీడీపీ నేత రేవంత్రెడ్డి చెప్పారు బుధవారం ఆయన నల్గొండలో జరిగిన టీడీపీ మినీ మహానాడు వేడుకలలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ్రదోహులంటూ నిందించిన వారికే కేసీఆర్ పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టి నిజమైన ఉద్యమ కారులని ఏడాడో మరచిపోయారని ఆరోపించారు.రానున్న రోజుల్లో కార్యకర్తలకి ఆని విధాలుగా సిఖాన ఇస్తామని నాయకులుగా ఎదిగీలా చూస్తామన్నారు
నాయకులెంత మంది వెల్లినా కార్యకర్తల బలం చెక్కు చెదర లేదని, తమ కార్యకర్తలపై దాడులకు దిగుతూ పార్టీ మారాలని తెరాస నేతలు చేస్తున్న వట్టుడులకు లొంగని కార్యకర్తలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారాయన.
బడుగు బలహీన వర్గాల భుజస్కందాలపై నదుస్తున్న తెలుగు దేశం పార్టీని తెలంగాణా రాష్ట్రంలో లేకుండా చేయాలనుకున్న తెరాస అధినేత ప్రయత్నాలు ఫలించవని వ్యాఖ్యా నించారు .రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని, దీనిని అంతం చేసేలా : సీఎం కేసీఆర్ను గద్దె దించేంత వరకు పోరాటం చేస్తానన్నరు.
ప్రజలకు వాస్తవాలు తెలియజేయటంతో పాటు చైతన్యం తీసుకు వచ్చేందుకు అవసరమైతే పాదయాత్ర చేసేందుకు తను సిద్ధమని చెప్పారు రేవంత్రెడ్డి .