షర్మిల... కేసీఆర్ బాణం... రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి.షర్మిల .కేసీఆర్ వదిలిన బాణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని, ఆయనకు అభిమానులు తెలంగాణలో ఉన్నాగాని ఇందిరమ్మ పార్టీలోనే వైఎస్ ముఖ్యమంత్రి అవటం జరిగిందని తెలిపారు.

 Telangana,sharmilla,revanth Reddy,kcr, Revanth Reddy Sensational Comments On Sha-TeluguStop.com

వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పుట్టుకొచ్చిందని స్పష్టం చేశారు.వైయస్ అంటే తెలంగాణ సమాజానికి గౌరవం, అభిమానం ఉందని పేర్కొన్నారు.అంతమాత్రాన షర్మిల పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితుల్లో ఎవరూ లేరని స్పష్టం చేశారు.రాజన్న బిడ్డ గా ప్రజలు అభిమానిస్తారు ఏమోగానీ పార్టీ పెడితే ఆమోదించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

కుటుంబంలో ఏదైనా గొడవలు ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలి, కాని తెలంగాణ లో కాదు అంటూ షర్మిల పై సెటైర్లు వేశారు.షర్మిల పొలిటికల్ ఎంట్రీ వెనకాల కెసిఆర్ హస్తం ఉందని ఆరోపించారు.

కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండటంతో.కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి కేసీఆర్ వదిలిన బాణం షర్మిల అంటూ రేవంత్ స్పష్టం చేశారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube