తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అకస్మికంగా గాంధీ ఆసుపత్రి పర్యటించడం ఊహించని విషయం.ఇక వైద్య ఆరోగ్య శాఖకు మంత్రిగా ఈటల ఉన్నంత కాలం అంతా తానే చూసుకున్నారు.
కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని ఆరోపణల వల్ల ఆయన పదవిని కోల్పోవడంతో ప్రస్తుతం ఆరోగ్య శాఖకు ప్రత్యేకంగా మంత్రి అంటూ ఎవరు లేరు.
ఈ క్రమంలో కేసీఆర్ ఈ శాఖను పర్యవేక్షిస్తున్నారు.
అదీగాకుండా ఇలాంటి ఆపద కాలంలో ఆరోగ్యశాఖ మంత్రిని పదవి నుండి తప్పించడం అనేది ఒక చర్చాంశనీయంగా మారిందని చెప్పవచ్చూ.ఇలాంటి సమయంలో పార్టీకి చెడ్దపేరు వస్తుందని కావచ్చూ, లేదా ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుందని కావచ్చూ గానీ మొత్తానికి సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రి పర్యటన హడావుడిగా మొదలైందట.
కాగా ఈ విషయం పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు.కోటలు దాటే మాటలు చెబుతూ అరచేతిలో వైకుంఠం చూపించడం మన ముఖ్య మంత్రికి అలవాటే అని, ప్రస్తుత గాంధీ పర్యటన కూడా అలాంటిదేనా అని సందేహం వ్యక్తం చేశారు.
ఇక వైద్య సిబ్బంది విషయంలో ఆలస్యం చేయకుండా కరోనా మూడో వేవ్ రాకముందే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.