మోడీ విధానాలనే కే.సి.ఆర్ అమలు చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి ఫైర్..!

మోడీ అమలు చేస్తున్న తెల్ల దొరల ఫాసిస్ట్ విధానాలనే తెలంగాణాలో కే.సి.

 Revanth Reddy Fires On Kcr And Pm Narendra Modi, Bjp , Congress , Trs , Ts Polti-TeluguStop.com

ఆర్ అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ఇద్దరి మీద మండిపడ్డారు.దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ప్రజలకు స్వేచ్చా వాయువులను ఇచ్చింది కాంగ్రెస్ అని..కాంగ్రెస్ పాలనలో భారత్ ఒక శక్తువంతమైన దేశంగా నిలబడ్డదని అన్నారు.మోడీ ప్రధాని అయిన తర్వాత దేశాన్ని అంబానీ, అదానీలకు తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు.వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతూ సామాన్యులపై భారం పెంచుతున్నారని అన్నారు.

మోడీ విధానాలనే తెలంగాణలో కే.సి.ఆర్ అమలు చేస్తున్నారని.మోడీ, కే.సి.ఆర్ ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు.బడుగు, బలహీన వర్గాల ఆశయాలు నెరవేరాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణాని ఇచ్చారని.కే.సి.ఆర్ పాలనలో బడుగు, బలహీన వర్గాల ఆశయాలు నెరవేరడం లేదని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.కే.సి.ఆర్ ను గద్దె దించితేనే సామాన్యులకు మేలు కలుగుతుందని అన్నారు. తన ప్రతి మీటింగ్ లో కే.సి.ఆర్ ను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తెస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube