సోనియా గాంధీపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారని, ఆమె గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా మాట్లాడాడు అంటూ రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామిపై ఎంపీ రేవంత్ రెడ్డి లోఖ సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు.లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లిఖితపూర్వకంగా రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఒక ఎంపీ, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలు అయిన సోనియా గాంధీ గారిపై ఆయన చేసిన విమర్శలు తమ మనోభావాలను దెబ్బ తీశాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఏప్రిల్ 21వ తారీకున సోనియా గాంధీపై అర్నాబ్ గోస్వామి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు.
సోనియా గాంధీ ఒక ఎంపీ మాత్రమే కాదు ఆమె దేశ స్వాతంత్య్రంలో భాగస్వామ్యం అయిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షురాలు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం నుండి వచ్చిన ఆమెను అవమానపర్చే విధంగా మాట్లాడటం దారుణం.
అందుకే లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసినట్లుగా ఆయన పేర్కొన్నాడు. అర్నాబ్ మతాల మద్య గొడవ పెట్టే విధంగా మాట్లాడాడు అంటూ కూడా రేవంత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నాడు.