వారిపై ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..!

కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇతర పార్టీల్లోకి వెళుతున్న వారిపై ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి.ప్రతిపక్షంలో గెలిచి సిగ్గులేకుండా అధికార పార్టీలోకి వెళ్తున్నారని ఆయన విమర్శించారు.

 Revanth Reddy Comments On Party Defectors, Comments, Congress Party, Defectors,-TeluguStop.com

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడ్గా నియమించబడ్డాక కాంగ్రెస్ టికెట్ పై గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లే వారిని రాళ్లతో కొట్టాలని ఈమధ్య అన్నారు.దానిపై టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే దాన నాగేందర్, సుధీర్ రెడ్డి, గండ్ర వెంక్టరమణా రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అయితే రేవంత్ మళ్లీ తన విమర్శలను గుప్పించారు.తాను గతంలో ఇండిపెండెంట్ గా గెలిచి ప్రతిపక్షంలో చేరానని చెప్పారు.అంతకుముందు కూడా జడ్పీటీసీగా కూడా ఇండిపెండెంట్ గానే గెలిచానని అన్నారు.అప్పుడు తాను కూడా కే.సి.ఆర్ కు సహకారం అందించానని.తెలంగాణా సాధన కోసమే టీ.ఆర్.ఎస్ కు మద్ధతు ఇచ్చానని రేవంత్ రెడ్డి అన్నారు.

టీ.

ఆర్.ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని.త్వరలో ఘర్ వాపసీ కార్యచరణ్ ఉంటుందని అన్నారు.దూకుడు తన సహజ లక్షణమని చెప్పిన రేవంత్ రెడ్డి అది మారదని అన్నారు.

పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపుడే అని తన వైఖరిని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కిన తర్వాత రేవంత్ తన దూకుడు పెంచారని చెప్పొచ్చు.

ఇప్పటికే పార్టీ సీనియర్లతో పార్టీ విధి విధానాలను చర్చిస్తున్నట్టు తెలుస్తుంది.జూలై 7న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube