తెలంగాణ సీఎం మరియు ఆయన కుటుంబ సభ్యులపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించాడు.
మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ మరియు ఆయన కుటుంబ సభ్యులు దండుపాళ్యం ముఠా సభ్యుల మాదిరిగా వ్యవహరిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశాడు.
అధికారంలో ఉన్నాం కదా అని అడ్డగోలుగా ప్రవర్తిస్తే మాత్ర ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆ విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవాలి హెచ్చరించాడు.టి ఆర్ ఎస్ నుండి హరీష్ రావు బయటకు వస్తాడని తాను భావించడం లేదు.
వారంతా కూడా దండుపాళ్యం భ్యాచ్ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.వారికి ప్రజలు బుద్ది చెప్పే రోజు వస్తుందని అన్నాడు.