తెలంగాణలో ఇప్పుడు ఓ కొత్త అంశం తెరమీదకు వచ్చింది.అదే ముందస్తు ఎన్నికలు.
ఈ మాట వింటేనే 2018 ఎన్నికలు గుర్తుకు రాక మానవు.ఎందుకంటే అప్పుడు కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు పోయి ప్రతిపక్షాలను దారుణంగా దెబ్బ తీశారు.
అయితే ఇప్పుడు రెండున్నరేండ్లు గడుస్తున్న నేపథ్యంలో మళ్లీ ఈ మాట ఉపందుకుంది.రాబోయే ఎన్నికల్లో కూడా కేసీఆర్ ఇలాగే ముందస్తుకు వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపత్యంలో ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
రేవంత్ ఇప్పుడు పగ్గాలు చేత బట్టాక పార్టీకి పూర్వ వైభంవం తెచ్చేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలోనే ఆయన రోజుకోసంచలన కామెంట్లతో రాజకీయాలను తనవైపు తిప్పుకునే పనులు చేస్తున్నారు.
అయితే ఇప్పడు కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో ముందస్తుకు వెల్తున్నారని రేవంత్రెడ్డి జోష్యం చెప్పడంతో ఈ ఈ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.పైగా ఖచ్చితంగా వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత ముందస్తుకు వెళ్లే అవకాశం ఉంటుందని రేవంత్ నొక్కి మరీ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ వ్యాఖ్యలు అటు టీఆర్ఎస్లోనూ ప్రకంపనలు రేపుతున్నాయి.
మళ్లీ ముందస్తుకు వెళ్తే ఈ సారి తమ పరిస్థితి ఏంటో అనే బయంలో ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు.ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా ఉన్నవారంతా మళల్ఈ తమకే అవకాశం దక్కుతుందో లేదో అనే ఆలోచనలో పడ్డారు.అయితే ఇలాంటి రూమర్లపై అటు కేసీఆర్ కూడా స్పందించాల్సి వచ్చింది.తాను ఎట్టి పరిస్థితుల్లో ముందస్తుకు వెల్లబోనని చాలా పనులు అలాగే ఉన్నాయని, వాటిని పూర్తి చేయకుండా ఎన్నికలు రావంటూ చెప్పారు.
కానీ టీఆర్ఎస్లో మాత్రం భయం పోవడం లేదు.ఎందుకంటే కేసీఆర్ పైకి మాట్లాడే మాటలకు ఆయన అంతరంగంలో ఉండే వ్యూహాలకు పెద్దగా సంబంధం ఉండదు కదా.
.