పదవీ విరమణ చేసే ఉద్యోగులకు గుడ్‎న్యూస్..!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పదవీ విరమణ చేసే ఉద్యోగులకు మోదీ సర్కారు శుభవార్త అందించింది.

 Retiring Employees, Good News, Provision Pension, Ppo, Central Government,-TeluguStop.com

కరోనా మహమ్మారితో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు ప్రొవిజనల్ పెన్షన్ అందిస్తామని స్పష్టం చేసింది.రెగ్యూలర్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ జారీ చేసేంత వరకు ఈ విధంగా ప్రొవిజనల్ పెన్షన్ అందిస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.

ఉద్యోగులు హెడ్ ఆఫీసులో పెన్షన్ ఫామ్స్ ను అందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.సర్వీస్ బుక్‎తో కలిపి క్లెయిమ్ ఫామ్‎ను పే అండ్ అకౌంట్స్ సరైన సమయంలో అందించలేక పోతున్నారని చెప్పారు.

ఈ నేపధ్యంలో ఉద్యోగులకు ప్రొవిజనల్ పెన్షన్ ఫెసిలిటీ అందిస్తున్నామని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.

మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ డిపార్ట్‎మెంట్ అప్‎గ్రేడ్ అయిందని తెలిపారు.

ఉద్యోగులు పదవీ విరమణ చేసే రోజునే పీపీవో అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు.మరోవైపు డిజిటలైజేషన్‎లో భాగంగా ప్రత్యేక పోర్టల్ ఆవిష్కరించామని అన్నారు.పదవీ విరమణ దగ్గర పడుతున్న ఉద్యోగులు వారి పెన్షన్ల స్టేటస్‎ను వెబ్‎సైట్‎లో చెక్ చేసుకునే వెసులుబాటు కల్పించామని అన్నారు.అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆఫీస్ వర్క్ ఆగిపోయిందని పేర్కొన్నారు.

దీంతో ప్రస్తుతం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పీపీవో ఆర్డర్లు అందలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube