నోట్ల రద్దు పిటిషన్లపై భారత అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది.ఈ మేరకు తీర్పును రిజర్వ్ చేసింది.2016 సంవత్సరంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలైయ్యాయి.ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన కేంద్రం, ఆర్బీఐ రికార్డులను పరిశీలన కోసం సీల్డ్ కవర్ లో సమర్పించాలని న్యాయస్థానం కోరింది.