ప్రస్తుత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త గవర్నర్ ని ప్రభుత్వం నియమించింది.గుజరాత్ ఐఏఎస్ క్యాడర్ కు చెందిన హస్ ముఖ్ ఆదియాను రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ గా నియమించారు.
హస్ ముఖ్ ఆదియా కేంద్ర ఫైనాన్స్ సెక్రెటరీగా విధులు నిర్వర్తించారు.ఆయన గత నవంబర్ లోనే రిటైరయ్యారు.
ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఈరోజు తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.రిజర్వ్ బ్యాంకు నిల్వలను తమకు ఇవ్వాలని కేంద్రం ఒత్తిడి తెచ్చింది.ఈ ప్రతిపాదనను ఆర్బీఐ గవర్నర్ తో పాటు అనేకమంది ఆర్థికవేత్తలు వ్యతిరేకించారు.ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం నాడు హఠాత్తుగా ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారు.