మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేసుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు దేవా కట్టా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్ను క్రియేట్ చేశాయి.కాగా ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.దీంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో రిపబ్లిక్ చిత్రానికి సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా ఓ వార్త షికారు చేస్తోంది.ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాను పూర్తి పొలిటికల్ డ్రామాగా దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించడంతో రిపబ్లిక్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఈ సినిమా రిలీజ్కు సంబందఇంచిన తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో మరో వార్త వినిపిస్తోంది.
రిపబ్లిక్ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మరోసారి మూతపడటంతో, రిలీజ్కు రెడీగా ఉన్న సినిమాలు వాయిదా పడ్డాయి.
అయితే థియేటర్లు ఇప్పట్లో తెరుచుకున్నా కూడా ఆడియెన్స్ థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారనే గ్యారెంటీ లేకపోవడంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే బెటర్ అని చిత్ర యూనిట్ భావిస్తోంది.దీంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాంలతో రిపబ్లిక్ చిత్ర నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మరి నిజంగానే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.