గణతంత్ర దినోత్సవ వేడుకలను హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్దంగా నిర్వహించారు.పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పి.ఏ.సి.చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీ అర్హమ్ ఖాన్, పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శ్రీ శంకర్ గౌడ్, పార్టీ నాయకులు శ్రీ ఎ.వి.రత్నం, శ్రీ షేక్ రియాజ్, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీ రాజలింగం, శ్రీ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
.