రిపబ్లిక్ డే వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్రంలో ఉన్న పెద్దలు చాలా మంది ప్రముఖులు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ క్రమంలో రిపబ్లిక్ డే వేడుకలు ఎప్పుడు సాంప్రదాయబద్ధంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జరుగుతాయని అందరికీ తెలుసు. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరిగిన వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అదేవిధంగా నాగబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జాతీయ జెండాను ఎగరవేశారు.జరిగిన ఈ వేడుకలో బ్లడ్ బ్యాంక్ సిబ్బందితో పాటు మెగా ఫ్యాన్స్ పాల్గొన్నారు.
అంతేకాకుండా మెగా అభిమానులు రక్తదానం కూడా చేశారు.ఈ సందర్భంగా రక్తం దానం చేసిన అభిమానులను చిరంజీవి అదేవిధంగా రామ్ చరణ్ ప్రత్యేకంగా పరామర్శించారు.