పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ సక్సెస్ చిత్రాల జాబితా తీస్తే అందులో ‘ఖుషి’ చిత్రం ముందు వరుసలో ఉంటుంది.భారీ స్థాయిలో ఆ సినిమా పవన్కు క్రేజ్ను తెచ్చి పెట్టింది.
ఆ సినిమాకు తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.తమిళంలో సైతం ‘ఖుషి’ సూపర్ హిట్ అయ్యింది.2001లో ‘ఖుషి’ చిత్రం వచ్చింది.అప్పటి నుండి కూడా ‘ఖుషి’ సినిమాకు సీక్వెల్ చేయాలని దర్శకుడు ఎస్.
జె.సూర్య భావిస్తున్నాడు.అది ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చబోతుంది.తాజాగా స్వయంగా సూర్య తాను ‘ఖుషి’ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.
తమిళంలో సీక్వెల్ తెరకెక్కబోతుంది.ప్రస్తుతం స్క్రిప్ట్ కూడా రెడీ అవుతోంది.
తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ సీక్వెల్ను పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే నిర్మాతగా రెండు సినిమాలను నిర్మించిన రేణుదేశాయ్ తాజాగా ఈ ‘ఖుషి’ సీక్వెల్ను నిర్మించేందుకు సిద్దం అవుతుంది.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ‘ఖుషి’ సినిమాను రేణుదేశాయ్ నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.అతి త్వరలోనే ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లబోతుంది.
తాజాగా కొత్త సంవత్సరం సందర్బంగా రేణుదేశాయ్ మరియు దర్శకుడు ఎస్.జె.సూర్యలు కలిసి డిన్నర్ చేసిన విషయం తెల్సిందే.ఆ సమయంలో సీక్వెల్ నిర్మాణం గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది.
తమిళంలో సూపర్ హిట్ అయితే తెలుగులో పవన్ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తాడా అనేది ప్రస్తుతం ఆసక్తిగా ఉంది.