లగ్జరీ కార్లు అమ్ముకున్న రేణూ.. ఎందుకో తెలుసా?

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, ప్రస్తుతం తన పిల్లలతో జీవితం గడిపేస్తోంది.త్వరలోనే కొత్త జీవితానికి నాంది పలుకుతానని గతంలో ఆమె వెల్లడించడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడిన సంగతి అందరికీ తెలిసిందే.

 Renu Desai Sold Her Luxury Cars, Renu Desai, Luxury Cars, Tollywood News, Gossip-TeluguStop.com

దీంతో ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎవరి జోక్యం అవసరం లేదని వారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసింది.కాగా టీవీ షోలతో బుల్లితెరపై ఎంట్రీ ఇస్తూ ఇండస్ట్రీలో కమ్‌బ్యాక్ ఇవ్వాలని రేణు భావిస్తోంది.

అయితే తాజాగా ఆమె తనకు చెందిన రెండు లగ్జరీ కార్లను అమ్మేసినట్లు తెలిపింది.దీంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.రేణు దేశాయ్ ఏమిటి కార్లు అమ్ముకోవడం ఏమిటి అంటూ వారు ఆరా తీశారు.అయితే రేణు దేశాయ్ కార్లు అమ్ముకున్నది ఆర్ధిక సమస్యల వల్ల కాదు, కేవలం పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో మాత్రమే.

తన వద్ద ఉన్న ఆడీ ఏ6, పార్చ్ బాక్స్‌టర్ కార్లను రేణు అమ్మేసింది.వాటి స్థానంలో హుండాయి కొనా ఎలెక్ట్రిక్ కారును ఆమె కొనుగోలు చేసినట్లు తెలిపింది.

ఇలా తనవంతు బాధ్యతగా పర్యావరణాన్ని కాలుష్యం చేయకుండా ఇలా ఎలెక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసిన రేణు, వాటి వల్ల అదనంగా ఖర్చవుతున్న ఇంధనం డబ్బును కూడా ఆదా చేసుకోగలుగుతున్నట్లు పేర్కొంది.ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని రక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరింది.

ఇక రేణు కార్లు ఎందుకు అమ్ముకుందో తెలుసుకున్న తరువాత పలువురు ఆమెను అభినందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube