కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతున్నా కూడా తనపై మాత్రం పుకార్లు పుట్టించడం ఆపడం లేదని, ఈ సమయంలో కరోనా గురించి ఇంతలా జనాలు భయపడుతున్నా కూడా కొందరు నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారంటూ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది.వకీల్ సాబ్ చిత్రంలో ఆమె నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది.
అవన్నీ కూడా పుకార్లే అంటూ చెప్పుకొచ్చింది.
తాజాగా సోషల్ మీడియాలో ఆమె ఒక లైవ్ వీడియో చేసింది.
అందులో ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ నుండి దూరంగా ఉండాలి అంటే అంతా కూడా ఇంటికే పరిమితం అవ్వాలని సూచించింది.ఇదే సమయంలో తాను వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలను ఆమె కొట్టి పారేసింది.
ఇలాంటప్పుడు కూడా నాపై ఇలా పుకార్లు పుట్టించడం ఏంటో నాకు అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది.
తాను పదే పదే ఆ సినిమా గురించి స్పందించినా కూడా మళ్లీ కొత్తగా పుకార్లు పుట్టిస్తూనే ఉన్నారంది.వకీల్ సాబ్ చిత్రంలో తాను నటించడం లేదని, ఆ విషయమై తనను ఎవరు స్పందించలేదు అంది.అసలు తాను ఎలాంటి సినిమాల్లో కూడా నటించడం లేదని చెప్పుకొచ్చింది.
సినిమాల్లో నంచాలనే ఆసక్తి ఉందా అనే ప్రశ్నకు ఆమె సమాధానంగా మాట్లాడుతూ మంచి పాత్రలు చేయాలని నాకు ఉంది.కాని సమయం వచ్చినప్పుడు రీ ఎంట్రీ ఇస్తానంటూ చెప్పుకొచ్చింది.