పవన్ కళ్యాణ్ భార్యగా తెలుగు వారందరికి కూడా సుపరిచితం అయిన రేణు దేశాయ్ ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా తెలుగు వారికి చాలా రెగ్యులర్గా సోషల్ మీడియా ద్వారా లేదంటే మరో మార్గం ద్వారా టచ్లోనే ఉంటుంది.పవన్ నుండి విడిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు మహారాష్ట్రలో పిల్లలతో కలిసి ఉంటున్న ఈమె తాజాగా హైదరాబాద్కు షిప్ట్ అవ్వాలని నిర్ణయించుకుంది.
అందుకు సంబంధించి ఈమె ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
పవన్ నుండి విడిపోయిన తర్వాత చాలా కాలం వరకు ఒంటరి జీవితం గడిపిన ఆమె పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యింది.
ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది.కాని కారణం ఏంటో తెలియదు కాని పెళ్లి అయితే కాలేదు.
పెళ్లి అవ్వదేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.రెండవ పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదనిపించడం వల్లనో లేక మరేంటో కాని రేణు దేశాయ్ మళ్లీ హైదరాబాద్కు వచ్చేయాలని నిర్ణయించుకుంది.
పిల్లల కోసం మరియు తన కెరీర్ కోసం ఆమె హైదరాబాద్కు రాబోతుందట.
పిల్లలు పెద్ద వారు అయిన కారణంగా తండ్రికి దగ్గరగా ఉండే ఉద్దేశ్యంతో రేణు దేశాయ్ వారిని హైదరాబాద్కు తీసుకు వస్తుంది.అలాగే తెలుగు ప్రేక్షకుల్లో తనకు మంచి క్రేజ్ ఉన్న కారణంగా సినిమాల్లో నటించాలని కూడా ఆశ పడుతుంది.సినిమాల్లో ఆమె రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం అయ్యింది.
అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి.రేణు అందుకే ఇక్కడకు మకాం మార్చుతుందని అంటున్నారు.
రేణు హైదరాబాద్ వస్తే బుల్లి తెరపై మరియు వెండి తెరపై ఆమె కనిపించే అవకాశం ఉంది.