తెలుగు సినీ నటి రేణు దేశాయ్.నటిగా కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య గా బాగా గుర్తింపు తెచ్చుకుంది.
తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన రేణుదేశాయ్ ఆ తర్వాత తెలుగులో బద్రి సినిమాతో పరిచయం అయింది.ఇక ఆ సమయంలో పవన్ తో పరిచయం పెంచుకోగా పవన్ తో 2009లో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది.
ఇక పెళ్లికి ముందే అకిరా నందన్ పుట్టాడు.ఇక పెళ్లి తర్వాత ఆద్య పుట్టింది.మనస్పర్థల వల్ల వీరిద్దరి విడిపోయారు.ఇక అప్పటి నుంచి రేణు దేశాయ్ తన పిల్లల బాధ్యతలు తానే చూసుకుంటుంది.
పవన్ మరో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక రేణు దేశాయ్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.
తన పిల్లలను అభిమానులకు పరిచయం చేసింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బుల్లితెర లో కూడా ఓ షోలో జడ్జిగా చేస్తుంది రేణు.ఇక ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలకు తన వంతు సహాయాన్ని చేస్తుంది.కావాల్సిన సరుకులు అందిస్తుంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లైవ్ లో సహాయం అడుగుతున్న వాళ్లకి వెంటనే స్పందిస్తుంది.ఇదిలా ఉంటే గతంలో తను అకీరా ఫోటో తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా.
చాలామంది సినిమాలలో నటిస్తున్నాడా అనే అనుమానాలు ఎదురవడంతో వెంటనే స్పందించిన రేణుదేశాయ్ అటువంటివి ఏవి ఊహించుకోని ప్రచారం చేయకండి అని పుకార్లకు ఫుల్స్ స్టాప్ పెట్టింది.
ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్స్ స్టా వేదికగా రేణు దేశాయ్ అకీరా తో కలిసి దిగిన ఫోటో అభిమానులతో షేర్ చేసుకోగా ఆ ఫోటోకు ఓ కాప్షన్ ఇచ్చింది.ఈ ప్రపంచంలో తనను చెప్పలేనంత ఆనందం లో ముంచేత్తగల ఒకే ఒక్కడు అకీరా అని తెలిపింది.అంతే కాకుండా అతని జోకులు వింటుంటే తన జోకులే తనను నవ్విస్తునట్టుగా ఉన్నాయని తెలిపింది.