పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతుందంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఆమద్య స్వయంగా ఆమె క్లారిటీ ఇచ్చింది.
బందిపోటు టైగర్ నాగేశ్వరరావు బయోపిక్లో కీలక పాత్రను పోషించేందుకు ముందు ఓకే చెప్పిన రేణు దేశాయ్ ఏవో కారణాలు చూపుతూ సినిమాను వదులుకున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుందని భావించిన రేణు దేశాయ్ అనూహ్యంగా ఇప్పుడు కాదంటోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించబోతున్న ఈ బయోపిక్లో రేణు దేశాయ్ కీలక పాత్రను పోషించబోతుంది అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.కాని సినిమా స్క్రిప్ట్ వర్క్ మరీ ఆలస్యం అవుతున్న కారణంగా సినిమా అసలు ఉందా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి సమయంలోనే లేట్ కారణమో లేక మరేంటో కాని సినిమాను వదిలేస్తున్నట్లుగా రేణు దేశాయ్ ప్రకటించింది.
తాజాగా తాను త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాను అని, అయితే అది రైతుల సమస్యలపై సాగే సినిమా అవుతుందని చెప్పుకొచ్చింది.
నటిగా రీ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది తెలియదు కాని దర్శకురాలిగా మాత్రం ఆమె రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది.త్వరలోనే ఆమె సినిమా వర్క్ ప్రారంభం కాబోతుందట.
ఈ విషయాన్ని రేణు స్వయంగా ప్రకటించింది.టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ నుండి రేణు తప్పుకోవడంతో ఆ స్థానంలో ఎవరు నటిస్తారో చూడాలి.