తెలుగు ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ మూవీ ‘బద్రీ’తో పరిచయం అయ్యింది రేణు దేశాయ్.ఈమె నటించింది కొన్ని సినిమాలే అయినా కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును ఈ అమ్మడు దక్కించుకుంది.
పవన్ కళ్యాణ్ భార్యగా మంచి గుర్తింపు దక్కించుకున్న రేణు దేశాయ్ ఆయన నుండి విడిపోయిన తర్వాత కూడా స్టార్ స్టేటస్ను కొనసాగిస్తూ వచ్చింది.రేణు దేశాయ్ రీ ఎంట్రీ కోసం ప్రేక్షకులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు ఆమె రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది.
వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న బెల్లంకొండ మూవీలో రేణు దేశాయ్ నటించబోతున్నట్లుగా రెండు మూడు నెలల క్రితమే ప్రకటన వచ్చింది.అయితే ఇప్పటి వరకు ఆ సినిమా అప్డేట్ ఏంటీ అనే విషయంలో క్లారిటీ లేదు.ఎట్టకేలకు ఆ విషయంపై రచయిత సాయి మాధవ్ బుర్ర క్లారిటీ ఇచ్చాడు.
సువర్టుపురం ప్రాంతంకు చెందిన దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.
ఈ చిత్రంలోని రేణు దేశాయ్ పాత్ర చాలా బాగుంటుందని, ఆమె చేసిన పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండి పోతుందని ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు.ఈ చిత్రంతో రేణు దేశాయ్ మరోసారి తన స్టార్డంను చూపబోతుందని ఆయన అన్నాడు.ఈ స్టోరీ చాలా బాగుంటుందని తప్పకుండా అందరిని అలరిస్తుందని సాయి మాధవ్ బుర్ర చెప్పుకొచ్చాడు.
రేణు దేశాయ్ ఈ చిత్రం తర్వాత మరిన్ని సినిమాల్లో నటిస్తుందో చూడాలి.ఒకవేళ ఈ చిత్రం సక్సెస్ అయ్యి రేణు పాత్రకు మంచి గుర్తింపు వస్తే కోట్లల్లో ఆమెకు పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు క్యూ కట్టడం ఖాయం.