టాలీవుడ్ లో భద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరువాత జానీ సినిమాలో సందడి చేసి హీరోయిన్ గా కెరియర్ ని వదిలేసి పవన్ కళ్యాణ్ భార్యగా మారిపోయిన నటి రేణు దేశాయ్.నటిగా చేసింది రెండు సినిమాలే అయినా మంచి టాలెంటెడ్ యాక్టర్ గా మాత్రం రేణు గుర్తింపు తెచ్చుకుంది.
పవన్ కళ్యాణ్ తో పెళ్లి, తరువాత కొంత కాలానికి విడాకులు తీసుకొని సింగిల్ మదర్ గా పిల్లలని పెంచే బాధ్యతలు చూసుకున్న రేణు దేశాయ్ గత కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దగ్గరగా ఉంది.మరాఠీలో దర్శకురాలిగా సినిమా చేసి సక్సెస్ అయిన తర్వాత తెలుగులో చాలా కాలంగా రైతుల కాన్సెప్ట్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుంది.
దానికోసం రీసెర్చ్ చేస్తుంది.అయితే మంచి కథలు దొరికితే నటిగా చేయడానికి తాను సిద్ధమే అని ఆ మధ్య రేణు దేశాయ్ ప్రకటించింది.
అప్పటి నుంచి ఆమె ఎంట్రీ ఉండబోతుంది అనే మాట పదే పదే వినిపిస్తూ వచ్చింది.
అయితే ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది.
ఆధ్య టైటిల్ తో పాన్ ఇండియా రేంజ్ లో వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు.సినిమా అనుకున్నా మళ్ళీ ఎందుకనో వెబ్ సిరీస్ గా మార్చేశారు.
తాజాగా ఈ వెబ్ సిరీస్ లాంచింగ్ జరుపుకుంది. ఆధ్య వెబ్ సిరీస్ ని ఏం.ఆర్.కృష్ణ మామిడాల తెరకెక్కించబోతున్నాడు.
అలాగే డి.ఎస్.రావు, రజనీకాంత్.ఎస్.సంయుక్తంగా నిర్మిస్తున్నారు.రేణుదేశాయ్పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి దర్శకుడు నీలకంఠ కెమెరా స్విఛాన్ చేశారు.
రేణుదేశాయ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే గొప్ప కథ ఇది.ఈ పాయింట్ నచ్చడంతో వెబ్సిరీస్లో నటించడానికి అంగీకరించా.నిజం కోసం ఓ మహిళ సాగించే అన్వేషణ నేపథ్యంలో సాగుతుంది’ అని చెప్పింది.ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయ్ మరో కీలక పాత్రలో కనిపించబోతుంది.