యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు అయిన బోయపాటి శ్రీను తాజాగా ‘సరైనోడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.‘సరైనోడు’ మాస్ ఆడియన్స్తో జేజేలు కొట్టించుకుంటుంది.
ఊర మాస్గా ఉంది అంటూ ప్రశంసలు అందుకుంటుంది.దాంతో బోయపాటికి మరింత క్రేజ్ పెరిగింది.
భారీ స్థాయిలో అంచనాలున్న ‘సరైనోడు’ సక్సెస్ అవ్వడంతో బోయపాటి తన పారితోషికాన్ని డబుల్ చేశాడు.
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను తన తర్వాత సినిమాకు ఏకంగా 12 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఆ మొత్తంను బెల్లంకొండ సురేష్ ఈయనకు అందించనున్నాడు.తన కొడుకును మాస్ హీరోగా ఎలివేట్ చేసేందుకు బెల్లంకొండ చాలా కష్టపడుతున్నాడు.
మొదటి సినిమాను దాదాపు 40 కోట్లు పెట్టి నిర్మించిన బెల్లంకొండ తాజాగా తన కొడుకు మరో సినిమాను బోయపాటి దర్శకత్వంలో మరింత బడ్జెట్తో నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు.
అల్లు అర్జున్తో తెరకెక్కించిన ‘సరైనోడు’ చిత్రానికి 6 కోట్లు తీసుకున్న బోయపాటి తన తర్వాత సినిమాకు ఏకంగా 12 కోట్లు తీసుకోవడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంది.
ఆ సినిమా కూడా సక్సెస్ అయితే ఆ తర్వాత సినిమాకు బోయపాటి ఎంత పారితోషికం తీసుకుంటాడో అంటూ ఆయన అభిమానులు అంటున్నారు.