హైదరాబాద్ ఉగ్రకుట్ర భగ్నం కేసులో రిమాండ్ రిపోర్టు

హైదరాబాద్ ఉగ్రకుట్ర భగ్నం కేసులో నిందితుడిగా అరెస్టైన జాహెద్ రిమాండ్ రిపోర్టు కీలక అంశాలు బయటపడ్డాయి.దీనిలో పేలుడు పదార్థాలు పాక్ నుంచి ఫరాతుల్లా గౌరీ పంపినట్లు అధికారులు గుర్తించారు.

 Remand Report In Hyderabad Terror Conspiracy Case-TeluguStop.com

మహారాష్ట్రలోని మనోహరాబాద్ కు పేలుడు పదార్థాలు, గత నెల 28న జాహెద్ కు పేలుడు పదార్థాలు చేరినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.బైకుపై వెళ్లి నాలుగు గ్రనేడ్లు తీసుకున్నాడని, తర్వాత ఒక గ్రనేడ్ ఉంచుకొని మిగతావి షమీ, మజాకు అందజేసాడు.అనంతరం షమీ సెల్ ఫోన్ తో ఫరాతుల్లా గౌరీతో జాహెద్ చాట్ చేసినట్టు గుర్తించారు.12 ఏళ్లు జైల్లో ఉండి తిరిగి వచ్చిన జాహెద్ ఉగ్ర కార్యకలాపాలకు ప్లాన్ చేశాడని పేర్కొన్నారు.పాక్ లో ఉన్న హ్యాండ్లర్ల ద్వారా ఈ కార్యకలాపాలకు ప్రణాళిక రచించాడని పోలీసులు వెల్లడించారు.యువకులకు డబ్బులిచ్చి ఉగ్రవాదం వైపు మళ్లించేవారని, హైదరాబాద్ లో జరిగే సామూహిక ఉత్సవాల్లో దాడులకు ప్లాన్ చేశారని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube