హైదరాబాద్ ఉగ్రకుట్ర భగ్నం కేసులో నిందితుడిగా అరెస్టైన జాహెద్ రిమాండ్ రిపోర్టు కీలక అంశాలు బయటపడ్డాయి.దీనిలో పేలుడు పదార్థాలు పాక్ నుంచి ఫరాతుల్లా గౌరీ పంపినట్లు అధికారులు గుర్తించారు.
మహారాష్ట్రలోని మనోహరాబాద్ కు పేలుడు పదార్థాలు, గత నెల 28న జాహెద్ కు పేలుడు పదార్థాలు చేరినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.బైకుపై వెళ్లి నాలుగు గ్రనేడ్లు తీసుకున్నాడని, తర్వాత ఒక గ్రనేడ్ ఉంచుకొని మిగతావి షమీ, మజాకు అందజేసాడు.అనంతరం షమీ సెల్ ఫోన్ తో ఫరాతుల్లా గౌరీతో జాహెద్ చాట్ చేసినట్టు గుర్తించారు.12 ఏళ్లు జైల్లో ఉండి తిరిగి వచ్చిన జాహెద్ ఉగ్ర కార్యకలాపాలకు ప్లాన్ చేశాడని పేర్కొన్నారు.పాక్ లో ఉన్న హ్యాండ్లర్ల ద్వారా ఈ కార్యకలాపాలకు ప్రణాళిక రచించాడని పోలీసులు వెల్లడించారు.యువకులకు డబ్బులిచ్చి ఉగ్రవాదం వైపు మళ్లించేవారని, హైదరాబాద్ లో జరిగే సామూహిక ఉత్సవాల్లో దాడులకు ప్లాన్ చేశారని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.