టాలీవుడ్లో ఎక్కువ సంపాదించే హీరో ఎవరంటే ఖచ్చితంగా మహేష్ బాబు పేరు ముందు గుర్తొస్తుంది.కేవలం సినిమాల్లోనే కాకుండా ఇండస్ట్రీలోనే ఎక్కువ యాడ్స్లో నటిస్తూ రెండుచేతులా సంపాదిస్తున్నాడు ఈ స్టార్ హీరో.
ఇక మహేష్ ఎన్ని బిజినెస్లలో కాలు పెట్టాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్తో తనదైన మార్క్ వేసుకున్నాడు.
కాగా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫాంలకు ఎలాంటి డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే.అయితే ప్రముఖ వ్యాపార దిగ్గజం జియో రిలయన్స్ ఈ ఓటీటీ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఇటీవల మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహా అనే యాప్తో డిజిటల్ ప్లాట్ఫాంలో అడుగుపెట్టగా అది పెద్దగా సక్సెస్ కాలేదు.దీంతో తెలుగులో ఓటీటీ బిజినెస్కు పెద్ద డిమాండ్ లేదని రిలయన్స్ గుర్తించింది.
వెంటనే ఆ ప్రాజెక్టులో పెట్టాలనకున్న సొమ్మును మహేష్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్కు ట్రాన్ఫర్ చేస్తోందట.ఈ విధంగా తెలుగులో పలు చిన్న సినిమాలను ఈ బ్యానర్ ద్వారా నిర్మించాలని జియో రిలయన్స్ భావిస్తోంది.
మొత్తానికి ఓటీటీ బిజినెస్ పెట్టాలనుకున్న రిలయన్స్ మహేష్కు కాసుల వర్షం కురిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.