రిలయన్స్ జియో నుండి మరో బంపర్ ఆఫర్ వచ్చేసింది.రిలయన్స్ జియో అతి తక్కువ ధరకే 5జి స్మార్ట్ ఫోన్ ను తీసుకువస్తుంది.
ఈ నెల 24న జరిగే వార్షిక వాటాదారుల మీటింగ్ లో రిలయన్స్ జియో 5జి లాంచ్ చేయబోతున్నారని తెలుస్తుంది.రిలయన్స్ నుండి రాబోతున్న ఈ 5జి స్మార్ట్ ఫోన్ ధర 5000 వేల కన్నా తక్కువగా ఉండటం విశేషం.
తెలుస్తున్న సమాచారం ప్రకారం రిలయన్స్ 5జి స్మార్ట్ ఫోన్ ధర 2500 నుండి 3000 వరకు ఉండొచ్చని తెలుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ధరని త్వరలో జరిగే మీటింగ్ లో డిసైడ్ చేస్తారని తెలుస్తుంది.4జి మొబైల్స్ వచ్చినా సరే ఇంకా ప్రస్తుతం కొందరు 2జి ఫోన్లు వాడుతున్నారు.అందుకే వారిని టార్గెట్ చేసుకుని రిలయన్స్ 5జి ఫోన్ అది కూడా తక్కువ ప్రైజ్ లో అందించాలని చూస్తుంది.20 నుండి 30 కోట్ల యూజర్లను టార్గెట్ చేసుకుని రిలయన్స్ 5జి ఫోన్ లాన్ చేస్తుందని తెలుస్తుంది.
ఇండియాలో 5జి స్మార్ట్ ఫోన్ ధరలు 27000 నుండి స్టార్ట్ అవుతున్నాయి.
అందుకే అంత ఎక్కువ ప్రైజ్ తో కాకుండా అదరికి అందుబాటులో ఉండేలా 5జి ఫోన్ అందించాలని నిర్ణయించారు రిలయన్స్ యాజమాణ్యం.ప్రస్తుతం అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ కంపల్సరీ అయ్యింది అందుకే 5జి తో తక్కువ ప్రైజ్ తో ఫోన్ ఇస్తే తప్పకుండా అందరు కొనే అవకాశం ఉందని ఈ ప్లాన్ చేశారు.
మరి రిలయన్స్ 5జి స్మార్ట్ ఫోన్లు ఎలా ఉంటాయన్నది రిలీజ్ అయితేనే కాని చెప్పగలం.