జయలలిత బయోపిక్ గా తెరకెక్కుతున్న సినిమా తలైవి.ఈ సినిమాలో కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుంది.
తలైవి సినిమా ఏప్రిల్ 23 న పాన్ ఇండియా లెవల్లో విడుదల కావాల్సి ఉంది.అయితే ఈ సినిమా పై కూడా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పడింది.
ఇప్పటికే ఉత్తరాదిన కరోనా విలయతాండవం చేస్తుంది.కేసులు పెరుగుతుండడంతో కొన్ని నగరాలూ లాక్ డౌన్ అవుతున్నాయి.
ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్స్ కూడా ఆగిపోయాయి.
ఈ నేపథ్యంలో తలైవి సినిమా ను విడుదల అసాధ్యం.
అందుకే చిత్ర నిర్మాతలు ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.ఈ సినిమా ను మొదట్లో అంతగా పట్టించుకోక పోయినా కంగనా పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయ్యిన ట్రైలర్ చుసిన తర్వాత ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
అంతేకాదు ఈ ట్రైలర్ తమిళనాడులో తీవ్ర చర్చకు కూడా దారి తీసింది.
ఈ ట్రైలర్ లో కంగనా ను చుస్తే జయలలితను చూసి నట్టుగానే ఉందని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.కంగనా అంతలా ఈ పాత్ర లో జీవించిందనే చెప్పాలి.నిజంగా జయలలిత వచ్చిందా అన్నట్టుగా ఈ సినిమాలో కంగనా కనిపించింది.
అభిమానులే కాదు ప్రముఖులు కూడా ఈ ట్రైలర్ చూసి కంగనాకు పొగడ్తలతో ముంచెత్తారు.
ఈ సినిమాను ఏ.
ఎల్ విజయ్ డైరెక్ట్ చేసారు.ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు.
అంతేకాదు మధుబాల కూడా కీలక పాత్రలో నటిస్తుంది.ఈ సినిమా విడుదల అవుతుందనే నేపథ్యంలో ఎప్పటి నుండో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది చిత్ర యూనిట్.
కానీ కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదు.కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.