నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది.ఈ మేరకు నోటిఫికేషన్ ను రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో ఉపఎన్నికకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారని తెలిపారు.కాగా ఈనెల 14 వరకు ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.
నవంబర్ 3న ఉపఎన్నిక, 6న కౌంటింగ్ జరగనుంది.మరోవైపు నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికార, విపక్ష పార్టీలు ప్రచారానికి రంగం సిద్ధం చేశాయి.
ఇప్పటికే గులాబీదళం మునుగోడుకు చేరుకోగా, బీజేపీ, కాంగ్రెస్ లు సైతం తమ తమ వ్యూహాలతో గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.