ఖరీఫ్ వ్యవసాయ సీజన్కు ఏపీ ప్రభుత్వం సాగునీరు విడుదల చేసింది.ఈ మేరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేశారు అధికారులు.
కృష్ణాతో పాటు గుంటూరు జిల్లాల కాలువలకు నీరు విడుదల చేశామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.త్వరగా ఖరీఫ్ ప్రారంభంతో మూడు పంటలు పండే అవకాశం ఉందన్నారు.
అదేవిధంగా ప్రకృతి విపత్తుల నుంచి కూడా రైతుకు ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.సీఎం జగన్ ప్రభుత్వం వచ్చాక నీటి కొరత అనేదే లేదని స్పష్టం చేశారు.