అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లోకి ధఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ జాన్వీ కపూర్.ఈ అమ్మడు మొదటి సినిమాతోనే బెస్ట్ యాక్టర్ అనిపించుకోవడంతో పాటు, వంద కోట్ల క్లబ్ లో చేరిన హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
హీరోయిన్ గా స్టార్ స్టేటస్ కోసం ఎవరైనా ఆరంభంలో కొంత కాలం కమర్షియల్, లవ్ స్టోరీ సినిమాలు చేస్తూ ఉంటారు.అయితే అందరిలో తన పంథా ప్రత్యేకం అని నిరూపించుకోవడానికి జాన్వీ కపూర్ రెండో సినిమానే ఏకంగా బయోపిక్ స్టోరీ సెలక్ట్ చేసుకుంది.
ఎయిర్ ఫైటర్ గుంజన్ సక్సేనా జీవిత కథతో తెరకెక్కిన సినిమాలో టైటిల్ రోల్ పోషించింది.ఈ సినిమా మీద జాన్వీ భారీగానే ఆశలు పెట్టుకుంది.
బాలీవుడ్ లో తనని తాను నటిగా ప్రూవ్ చేసుకోవడానికి దొరికిన గొప్ప అవకాశంగా ఈ సినిమా ఉపయోగపడుతుంది అని భావించింది.
అయితే సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయిన కూడా థియేటర్లో విడుదల అయ్యే సమయానికి కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడిపోయింది.
మళ్ళీ థియేటర్లు ఎప్పటికి తెరుస్తారో తెలియని పరిస్థితి.ఈ నేపథ్యంలో ఈ సినిమాలో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు రెడీ అయిపోయారు.సినిమాకి నెట్ ఫ్లిక్స్ నుంచి మంచి రేటు రావడంతో డిజిటల్ రిలీజ్ వైపు మొగ్గు చూపించారు.ఈ నేపధ్యంలో గుంజన్ సక్సేనా సినిమా రిలీజ్ డేట్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది.
వచ్చే నెల 12వ తేదీన సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేసింది.ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఉండటంతో కచ్చితంగా డిజిటల్ ప్రేక్షకులని మెప్పిస్తుందని భావిస్తున్నారు.
జాన్వీ కపూర్ బెస్ట్ యాక్టర్ అనిపించుకోవాలని కలకి ఈ సినిమా ఎంత అరకు హెల్ప్ అవుతుంది అనేది వేచి చూడాలి.