పాయకరావుపేట మండలం పాయకరావుపేట ప్రధాన రహదారి వద్ద తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష లు చేస్తున్న తెదేపా శ్రేణులు.ఈ మూడున్నర ఏళ్ళ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక అభివృద్ది కార్యక్రమంఅయినా ఉందా అంటూ అనిత ఫైర్.
అధికారం వచ్చినప్పటి నుండి ప్రజావేదిక కూల్చడం నుండి ఇప్పటివరకు కూల్చివేత లు తప్ప కట్టడాలు ఏమైనా చేశారా అంటూ ఎద్దేవా.ఎన్.టి ఆర్ పేరు కే మచ్చ తెచ్చే విధంగా ,ఆయన ప్రతిష్ట కు భంగం కలిగేలా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై మండిపాటు.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు పేరుతో ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైయస్సార్ ప్రభుత్వం కుట్రపూరిత నిర్ణయం తీసుకుని వైయస్సార్ పేరుగా మార్పు పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అనిత మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చయ్య నాయుడు పిలుపుమేరకు ఈ రిలే నిరాహారదీక్షలు.