జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ భారతీయ విద్య భవన్ సర్కిల్ వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు.
ఈ నెల 9న వినాయక్ సాగర్లో నిమజ్జనోత్సవాలు నిర్వహిస్తామన్నారు.సమయం సమీపిస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ధార్మిక కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు.కాలుష్యం, కోర్టు తీర్పు బూచిగా చూపి నిమజ్జనాలను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.
ఏ కోర్టు కూడా సాగర్లో నిమజ్జనాలు చేయొద్దని చెప్పలేదన్నారు.