ఒకప్పుడు ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంలో నందమూరి హీరో తారకరత్న సరసన ఆడి పాడినటువంటి ముద్దుగుమ్మ రేఖ వేదవ్యాస్ ఇప్పటికీ అందరికీ బాగానే గుర్తుంటుంది.ఈ చిత్రంలోని “నువ్వు చూడు చూడకపో” అనే ఎమోషనల్ సాంగ్ ఇప్పటికీ పలువురు ఇష్టమైన పాటల జాబితాలో ఉంటుంది.
అయితే ఆ తర్వాత కూడా జానకి వెడ్స్ శ్రీరామ్ మరియు పలు తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు.అయితే తాజాగా రేఖ వేదవ్యాస్ “ఆలీతో సరదాగా” అనే కార్యక్రమంలో పాల్గొంది.
ఇందులో భాగంగా తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
అయితే ప్రస్తుతం తాను ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటున్నట్లు తెలిపింది.
అయితే తాను పుట్టి పెరిగింది ఉడిపిలో అని ఆ తర్వాత సినిమాల రీత్యా ముంబై హైదరాబాద్, చెన్నై, మహారాష్ట్ర ఇలా అన్ని ప్రదేశాలను రౌండప్ చేస్తున్నానని అన్నారు.అయితే యాంకర్ ఆలీ అప్పట్లో సడన్ గా మీరు చనిపోయారని వార్త వచ్చింది అసలు ఇంతకీ ఏమైందని అడిగారు.
అయితే ఈ ప్రశ్నకి రేఖ వేదవ్యాస్ సరదాగా సమాధానం చెబుతూ ఎంత మందికి ఉంటుంది బ్రతికి ఉన్నప్పుడే ఇలా శ్రద్ధాంజలి ఘటించుకోవడం అంటూ నవ్వారు.అలాగే ఆ వార్త వచ్చిన సమయంలో తాను తనకు తెలిసిన బంధువుల ఇంట్లో ఉన్నానని ఆ రోజు రాత్రి తను అక్కడే బస చేసి పొద్దున్నే తెల్లవారుజామున సమయంలో వెళ్లిపోయానని, కానీ తన మరణ వార్త చదివి నటువంటి తన బంధువులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు అని చెప్పుకొచ్చింది.దీంతో తో వెంటనే తమ తల్లిదండ్రులకు లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయని అన్నారు.
అయితే ప్రస్తుతానికి తాను బాగానే సెటిల్ అయ్యాను కానీ ముఖేష్ అంబానీ అంత కాదని అన్నారు.అయితే రేఖ వేదవ్యాస్ గురించి మరిన్ని ఆసక్తికర వివరాలు తెలియాలంటే వచ్చే మంగళవారం వరకు ఆగాల్సిందే.