డ్రగ్స్ కేసు.నెట్టింట్లో ఎంత వైరల్ అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు.అందరిని షాక్ కి గురిచేస్తుంది.తీగ లాగితే డొంక కదిలినట్టు.బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో బాలీవుడ్ పరిశ్రమలో ఎన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయ్.మొదట బంధు ప్రీతి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని వచ్చిన వార్తలు తర్వాత తండ్రి కేసు పెట్టడంతో అతడి ప్రేయసి రియా చక్రవర్తిని సిబిఐ విచారించడం.
డ్రగ్స్ గురించి బయటపడటం అంత తెలిసింది.
అయితే ఇటీవల రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు.
అయితే రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నాటి నుంచి టాలీవుడ్, కోలీవుడ్ అని లేకుండా ప్రతి పరిశ్రమలో ఒక్కొకటి బయటకు వచ్చి అందరిని షాక్ కి గురి చేస్తున్నాయ్.సౌత్ ఇండియా సినీ వర్గాలు అన్ని షాక్ కి గురవుతున్నాయ్.
ఇక ఇప్పుడు డ్రగ్స్ వాడకం, సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన రియా చక్రవర్తి ని కస్టడీలోకి తీసుకొని విచారణ చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఇంటరాగేషన్ చేయగా వారిలో దాదాపు 25 మంది సినీ ప్రముఖుల పేర్లు ఆమె బయటపెట్టింది.ఇక అందులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు కూడా ఉండటం ప్రస్తుతం సంచలనంగా మారింది. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్న వారిలో ఎక్కువగా బాలీవుడ్ అగ్ర హీరో హీరోయిన్లే ఉన్నట్లు సమాచారం.
డ్రగ్స్ మాఫియాతో మేజర్గా సారా అలీ ఖాన్, సైమోన్ కంబట్టాలకు డీలింగ్స్ ఉన్నాయట.
ఎన్సీబీ విచారణలో రియా చక్రవర్తి ఈ ముగ్గురి పేర్లు బయటపెట్టగా సారా అలీ ఖాన్ డ్రగ్స్ తీసుకొనే సన్నగా అయినట్టు నెట్టింట్లో వార్తలు షికారు అవుతున్నాయ్.
కాగా ఇప్పటికే నెట్టింట్లో రియా చక్రవర్తికి రకుల్ కి మంచి స్నేహం ఉందని వార్తలు రాగ ఇప్పుడు డ్రగ్స్ వాడకంలో ఆమె పేరు భయటకు రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది.మరి ఈ విషయంపై రకుల్ ప్రీత్, సారా అలీఖాన్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.