సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి రెజినా కసాండ్రా.ఈ భామ తెలుగులో కుర్ర హీరోలకి జోడీగా నటిస్తూ ఓ రెండేళ్ళ పాటు మంచి గ్రేస్ చూపించింది.అలాగే తమిళంలో కూడా అదే స్పీడ్ చూపించింది.తరువాత అవకాశాలు తగ్గిపోయాయి.ఆమె తెలుగులో చివరిగా చేసిన సినిమా ఎవరు.అందులో నెగిటివ్ రోల్ లో నటించిన రెజినా నటిగా మార్కులు కొట్టేసింది.
ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా సినిమాలు లేవు.ఆచార్య సినిమాలో ఒక ఐటెం సాంగ్ మాత్రం చేయడానికి ఒకే చెప్పింది.
ఇదిలా ఉంటే తాజాగా రెజినా తన మనసులోని మాటని బయటపెట్టింది.
తనకి హాట్ అండ్ బోల్డ్ గా కనిపించే పాత్రలు అన్న, నెగిటివ్ షేడ్స్ తో విలనిజం చూపించే పాత్రలు అంటే ఇష్టం అని, అలాంటి పాత్రలు వస్తే తానేంటో చూపిస్తా అని చెబుతుంది.
టిపికల్ గా అనిపిస్తూ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలు పాత్రలు చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చింది.ఆ తరహా పాత్రలు చేయడంలో థ్రిల్ ఉంటుందని, చాలెంజింగ్ గా అనిపిస్తుందని రెజినా చెప్పడం విశేషం.
ఆమె కోరుకున్న తరహాలోనే ఎవరు సినిమాలో ఆమె పాత్ర ఉంటుంది.అయితే అలాంటి పాత్రలు సృష్టించి ఆమెకి అవకాశం ఇచ్చే దర్శకులు ఎవరుంటారు అనేది చూడాలి.