అందాల భామ రెజీనా క్యాసెండ్రా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పుడు వరుసబెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది.క్రమంలో అమ్మడు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా మారుతుండటంతో, ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వస్తోంది.
ఇక ఈ బ్యూటీ ఇటీవల సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎవరు సినిమాతో నిరూపించింది.కాగా మరో సస్పెన్స్ జోనర్ మూవీలో రెజీనా నటిస్తుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.‘నేనే నా.?’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ పోస్టర్లో రెజీనా ఓ రాజకుమారిగా ఉన్న ఫోటోలో మనకు కనిపిస్తుంది.ఈ ఫోటో చూస్తుంటే ఇదొక థ్రిల్లర్తో కూడిన సస్పెన్స్ మూవీ అని ఇట్టే అర్థమవుతుంది.
ఇక ఈ సినిమాలో రెజీనా పాత్ర ఎలా ఉండబోతుంది అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇక సందీప్ కిషన్తో ‘నిన్ను వీడని నీడను నేనే’ అనే థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించిన కార్తీక్ రాజు, నేనే నా అంటూ మరోసారి అదరగొట్టేందుకు రెడీ అయ్యాడు.
ఈ సినిమాలో రెజీనా లీడ్ రోల్ చేస్తుండగా వెన్నెల కిషోర్, అక్షర గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.యాపిట్ ట్రీ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు సామ్ సంగీతం అందిస్తున్నాడు.
మరి ఈ సినిమాలో రెజీనా ప్రశ్నకు సమాధానం ఏమై ఉంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.