సుదీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఎస్ఎంఎస్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ రెజీనా కాసాండ్ర.సందీప్ కిషన్ తో నటించిన రొటీన్ లవ్ స్టోరీ సినిమా ఈ అమ్మడుకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
తరువాత సాయి ధరమ్ తేజ్ తో పిల్లా నువ్వు లేని జీవితం’ సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.ఇక ఈ అమ్మడు వరుస హిట్స్ తో మంచి స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో వెలిగిపోతుందని అందరూ భావించారు.
అయితే ఊహించని విధంగా ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.కుర్రహీరోలు కూడా రెజీనాకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.
అయితే అడపాదడపా అవకాశాలు సొంత చేసుకొని కెరియర్ నెట్టుకొచ్చిన అనుకున్న స్థాయిలో మాత్రం ఆదరణ రాలేదు.
తెలుగులో అవకాశాలు తగ్గిన ఈ అమ్మడుకి తన మాతృభాషలో మాత్రం భాగానే అవకాశాలు వస్తున్నాయి.
అక్కడ సినిమాలలో అందాల ప్రదర్శనకి కూడా ఫుల్ పర్మిషన్ ఇచ్చేయడంతో ఈ అమ్మడుని వాడుకోవడానికి తమిళ దర్శకులు రెడీ అయిపోయారు.ఈ నేపధ్యంలో ఓ రెండు, మూడు సినిమాలో తమిళంలో అమ్మడు చేతిలో ఉన్నట్లు తెలుస్తుంది.
అలాగే కన్నడ సినిమాల నుంచి కూడా ఈ భామకి అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.తెలుగులో మాత్రం చిరంజీవి ఆచార్య సినిమాలో ఒక ఐటెం సాంగ్ కి మాత్రమే ప్రస్తుతం రెజీనా పరిమితం అయ్యింది.
మరి తన టాలెంట్ తో పాటు, సొంత బాష ఫీలింగ్ తో ఆమెకి తమిళనాట అవకాశాలు ఇచ్చేవారు పెరుగుతారేమో చూడాలి.