ఎస్ఎంఎస్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రెజినా కసాండ్రా.ఈ అమ్మడు నటిగా మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసి తరువాత సందీప్ కిషన్ కి జోడీగా రెండు సినిమాలు చేసింది.
ఆ తరువాత పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలో సాయి తేజ్ కి జంటగా నటించింది.ఈ సినిమా హిట్ అవ్వడంతో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో మరో సారి ఈ జంటని రిపీట్ చేశారు.
ఈ సినిమాలో డాన్స్, యాక్టింగ్, గ్లామర్ తో రెజినా బెస్ట్ అనిపించుకుంది.ఈ సినిమా హిట్ కావడంతో రెజినా స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ భావించారు.
అయితే ఏమైందో ఏమో సడెన్ గా ఆమె కెరియర్ డ్రాప్ అవుతూ వచ్చింది.కుర్ర హీరోలకి జోడీగా చేసేందుకు అవకాశం ఉన్న రెజినాకి తెలుగులో అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.
కొన్ని సినిమాలు చేసిన అవి అంతగా వర్క్ అవుట్ అవ్వకపోవడం కెరియర్ భాగా డ్రాప్ అయిపొయింది.అడవి శేష్ కాంబినేషన్ లో ఎవరు అనే సినిమాలో రెజినా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పెర్ఫార్మెన్స్ తో మంచి మార్కులు కొట్టేసింది.
ఆ సినిమా తర్వాత మరో తెలుగులో సినిమాలో హీరోయిన్ గాని, విలన్ గా గాని రెజినాకి అవకాశం రాలేదు.అయితే మాతృభాష తమిళంలో భాగానే అవకాశాలు రావడంతో అక్కడికి వెళ్ళింది.
ఒక్కడ కూడా వరుసగా ఓ మూడు సినిమాలు చేసిన ఖాళీ అయిపొయింది.ఇక విశాల్ చక్ర సినిమా కోసం రెజినాని ఏకంగా పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేశాడు.
అయితే సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న సక్సెస్ క్రెడిట్ గాని, ఆమె పాత్రకి గాని అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న చక్ర సినిమా ఆమెకి నిరాశే మిగిల్చింది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఆచార్య మూవీ ఐటెం సాంగ్ మాత్రమే ఉంది.దీని తర్వాత అయిన రెజినా కెరియర్ పుంజుకుంటుంది ఏమో చూడాలి.