టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు అందుకున్న అందాల భామ రెజీనా కాసాండ్రా.ఈ అమ్మడు సాయి తేజ్ తో పిల్లనువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలలో వరుస హిట్స్ కొట్టింది.తెలుగులో మంచి స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు.అయితే ఏమైందో ఈమె ఎంత వేగంగా టాలీవుడ్ అవకాశాలు అందుకుందో అంతే వేగంగా అవకాశాలు కోల్పోయింది.నక్షత్రం లాంటి సినిమాలో అందాలు ఆరబోసిన ఎవరూ కూడా రెజీనాని పట్టించుకోలేదు.ఆమె చివరిగా తెలుగులో అడవి శేష్ తో ఎవరు అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించింది.
ఆ పాత్రలో భిన్నమైన షేడ్స్ లో తెరపై అద్భుతంగా ఆవిష్కరించింది.అలాగే సెవెన్ అనే సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించిన ఆ సినిమా వర్క్ అవుట్ కాలేదు.
ఇక లాభం లేదనుకొని మాతృబాషలోకి వెళ్ళిపోయింది.అక్కడ రెజీనాకి బాగానే అవకాశాలు వస్తున్నాయి.
విశాల్ సైబర్ థ్రిల్లర్ మూవీ చక్రలో విలన్ గా రెజీనా నటిస్తుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈమె కార్తిక్ రాజు నిర్మాణంలో ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేస్తుంది.
శూర్పణఖ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.తెలుగు, తమిళ బాషలలో ఇక కాలంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రెజీనా పరిశోధన ఆసక్తికరమైన సంఘటనలకు దారి తీస్తుందట.ఆ తర్వాత నుంచి ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే మలుపులతో సినిమా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది.
ఇక ఈ సినిమాలో శూర్పణఖ ఎవరనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసే పరిశోధన స్టూడెంట్ గా రెజీనా పాత్ర ఉండబోతుంది.మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అయినా రెజీనా మళ్ళీ హీరోయిన్ గా బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి.