టాలీవుడ్లో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన రెజీనా కాసాండ్రా మరియు నివేదా ధామస్ తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.తమ నటనతో ప్రేక్షకులను మెప్పించిన వీరు పలు హిట్ సినిమాలలో నటించారు.
తమదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీలు కలిసి తాజాగా ఓ కొరియన్ రీమేక్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు.
ఇటీవల సమంత నటించిన ఓ బేబీ కూడా కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ అనే విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమాతో సమంత హిట్ కొట్టింది.ఇప్పుడు ఇదే ఫార్ములాను ఓ బేబీ నిర్మాతలు సురేష్ బాబు, సునీత తాటి తాజాగా మరో కొరియన్ సూపర్ హిట్ మూవీ అయిన ‘మిడ్నైట్ రన్నర్స్’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చిత్ర యూనిట్.
ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా కొరియన్ చిత్రాల రీమేక్కు కేరాఫ్గా టాలీవుడ్ మారనుందనే మాట మాత్రం వాస్తవం అంటున్నారు సినీ విశ్లేషకులు.
ఈ సినిమాతో రెజీనా, నివేధా థామస్లు తెలుగులో మరో సక్సె్స్ను అందుకోవడం ఖాయమని అంటున్నాయి సినిమా వర్గాలు.