రీమా సేన్.ఒకప్పటి స్టార్ హీరోయిన్.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమెకంటూ ఒక మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.2000 సమయంలో తేజ దర్శకత్వం వహించిన చిత్రం మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది.అప్పట్లో మితిమీరిన అందాల ఆరబోత చేసింది రీమా సేనే.చిత్రం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు తెలుగు, తమిళ్ లో మంచి అవకాశాలు వచ్చాయ్.
రెండు మూడు హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది.తెలుగు తమిళ్ భాషల్లో కొన్ని సంవత్సరాల పాటు ఆమె స్టార్ డాం కొనసాగింది.
అయితే దాదాపు అప్పట్లో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ వల్లభ, యుగానికి ఒకడు వంటి చిత్రాల్లో విలన్ గా నటించింది అందరిని షాక్ కి గురి చేసింది.అప్పటి వరకు హాట్ హీరోయిన్ గా పేరు సంపాదించినా రీమా సేన్ ఆ విలన్ పాత్రల్లో మెరిసి అందరిని మెప్పించింది.
అయితే ఏమైందో తెలియదు.మంచి స్టార్ డాం ఉన్నప్పుడే ఆమె సినిమాలకు దూరం అయ్యింది.సినిమాలకు పూర్తిగా దూరం అయ్యి ప్రముఖ పారిశ్రామిక వేత్త అయినా శివ కరణ్ సింగ్ అనే వ్యక్తిని 2012లో పెళ్లి చేసుకుంది.ఇప్పుడు అసలు ఏ సినిమాలో కనిపించకుండా పోయిన రీమా సేన్ వైవాహిక జీవితాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తోంది.
అయన భర్త శివ కరణ్ సింగ్ కు భారత దేశంలో టాప్ రెస్టారెంట్ గ్రూప్స్ కి ఆయన అధినేత.శివకిరణ్ కి ప్రతి రాష్ట్రంలో ఒక రెస్టారెంట్ ఉంది.
రీమా సేన్ ని తొలిచూపులోనే ప్రేమించాడు.పెద్దలని ఒప్పించి 2012లో పెళ్లి చేసుకున్నాడు.
ఇక వీరిద్దరికి 2013లో ఒక కొడుకు కూడా పుట్టాడు.ఆ అబ్బాయి పేరు రుద్రవీర్ సింగ్.