రాష్ట్రంలో తగ్గిన మద్యం ధరలు

హైదరాబాద్( Hyderabad ) :మందుబాబులకు తెలంగాణ సర్కార్( Telangana Govt ) భారీ శుభవార్త చెప్పింది.

మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం విధించే ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

దీంతో రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గాయి.ప్రభుత్వ తాజా నిర్ణయంతో క్వార్టర్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 మేర ధరలు తగ్గనున్నాయి.తగ్గించిన మద్యం ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బీరు మినహా అన్ని రకాల మద్యం బ్రాండ్ల( Liquor brands )పై ధరలు తగ్గాయి.అక్రమ మద్యం కట్టడిలో భాగంగా ఈ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఫుల్ బాటిల్ పై 160 పెంచారు 40 రూపాయలు తగ్గించారు.ఇంకా 120 దండుకుంటున్నారు.

Advertisement

సవితి తల్లి ప్రేమ అంటే ఇదేనేమో!.

ఉబర్ ట్యాక్సీ బుక్ చేస్తే టెస్లా కారు వచ్చింది.. యూట్యూబర్‌ వీడియో వైరల్..?
Advertisement

Latest Hyderabad News