మాయదారి కరోనా వల్ల ప్రజలకు ఆనందం దూరం అయ్యిందని చెప్పవచ్చూ.ఇంకా తగ్గని కరోనాతో నానావస్దలు ఎదుర్కొనే పరిస్దితులు నెలకొన్నాయి.
ఇక ప్రయాణాలు, దైవదర్శనాలు అంటే ఆసక్తి ఉన్న వారు మాత్రం ఎక్కడికి కదలకుండా, ఒక్కచోటే ఉంటూ జైలులో ఉన్నట్లుగా ఫీలవుతున్నారు.కనీసం భక్తిగా ఆలయాలను సందర్శించుకునే భాగ్యం కూడా చాలామంది నోచుకోవడం లేదు.
ఇకపోతే తిరుమల తిరుపతిలోని శీవారి ఆలయం ఒకప్పుడు ఊహించని స్దాయిలో భక్తులతో అలరారుతూ ఉండేది.కాని ఈ వైరస్ వల్ల ఆ సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తుంది.
రోజుకు దాదాపు లక్ష మంది వరకూ దర్శనం చేసుకునే తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయాన్ని నిన్న గరువారం నాడు కేవలం 25,625 మంది మాత్రమే దర్శించుకున్నారని సమాచారం.
కాగా నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 2,10 కోట్లు, కాగా 13,344 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.ఇకపోతే కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టైమ్ స్లాట్ దర్శనాన్ని నిలిపివేసిన టీటీడీ ప్రస్తుతం రూ.300 దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వారికి మాత్రమే దర్శనాన్ని కల్పిస్తున్నారు.