మొబైల్ ప్రియులకు షియోమీ గుడ్ న్యూస్ చెప్పింది.మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ ను ఇండియన్ మొబైల్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు షియోమీ కంపెనీ సిద్ధమయ్యింది.
రెడ్మీ 10ఏ (Redmi 10A) పేరిట ఈ మొబైల్ ని ఏప్రిల్ 20న తీసుకొస్తున్నట్లు షియోమీ వెల్లడించింది.ఇందులో లార్జ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ, ర్యామ్ బూస్టర్ వంటి ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లు చాలా ఉన్నాయి.
ఈ ఫోన్ మార్చి నెలలో చైనాలో మూడు వేరియంట్లలో రిలీజ్ అయింది.4జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్ 699 యువాన్లు (దాదాపు రూ.8,300)కే చైనాలో అందుబాటులోకి వచ్చింది.ఇక 4జీ ర్యామ్ + 128జీబీ ధర 799 యువాన్లు (దాదాపు రూ.9,500) ఉండగా 6జీబీ ర్యామ్ + 128జీబీ ధర 899 యువాన్లు (దాదాపు రూ.10,700)గా నిర్ణయించారు.ఇండియాలో కూడా దాదాపు ఇదే ధరలతో ఈ ఫోన్ మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో ప్రాసెసర్తో ఇది రన్ అవుతుంది.
అమెజాన్లో రెడ్మీ 10ఏ మొబైల్ ను కొనుగోలు చేయొచ్చు.
ఎవాల్ డిజైన్తో వచ్చే ఈ బడ్జెట్ మొబైల్ స్పెసిఫికేషన్లు తెలుసుకుంటే… ఇందులో 6.53 ఇంచుల హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్, ఇంటర్నల్ స్టోరేజీని యూజ్ చేసి వర్చువల్గా ర్యామ్ను ఎక్స్ పాండ్ చేసే ఫీచర్, మైక్రో ఎస్డీ కార్డు కోసం స్పెషల్ స్లాట్ ఉంటుంది.కెమెరాల విషయానికొస్తే, ఇందులో బ్యాక్ సైడ్ 13ఎంపీ కెమెరా అందించగా… సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఆఫర్ చేశారు.5000ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది వస్తుంది.