సోనియా గాంధీ గురించి తెలుసుకోవడానికి, ఆమె జీవితంలో ఎత్తు పల్లాల పై అవగాహన కలిగేందుకు ఒక పుస్తకం మార్కెట్ లోకి వచ్చింది.విషయం ఏమిటంటే ఎక్కడో ఇటలీలోని ఓ సాధారణ కుటుంబంలో పట్టిన సోనియా.
ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఎలా అధినేత కాగలిగారు.ఆమె జీవితంలోని ఎత్తుపల్లాలేంటి.
అన్న విషయాలా పై స్పానిష్ రైటర్ జేవియర్ మోరో ఏడేళ్ల క్రితం ఒక పుస్తకం రచించాడు.దానికి “రెడ్ శారీ: ఎ డ్రమటైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ సోనియాగాంధీ” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ సైతం పెట్టాడు.అదే క్రమంలో 2010లోనే ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ బాషలో విడుదల చేసే విశ్వప్రయత్నమే చేశాడు, కానీ ఫలితం కనపడలేదు.అప్పట్లో కొంగర్స్ ప్రభుత్వం అధికారంలో ఉండడమే దీనికి కారణం అంటూ వార్తలు సైతం గుప్పు మన్నాయి.
ఇదిలా ఉంటే ఐదేళ్ల తర్వాత ఇన్నాళ్లకు ఇండియాలో ఈ బుక్ రిలీజైంది.ఇందులో ఎన్నో ఆసక్తికర విషయాలను పొందుపరిచాడు రచయిత అందులో ముఖ్యంగా రాజీవ్ హత్య తర్వాత సోనియా వెళ్లిపోవాలనుకుందా.? ఎమర్జెన్సీ హయాంలో సోనియా ఎలాంటి పాత్ర పోషించారు.? ఇటలీ సోనియా -ఇండియన్ మేనకా మధ్య సంబంధాలు ఎలా ఉండేవి.? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి.మరి ఈ పుస్తకంపై కొంగ్రెస్ పార్ట్ వారే పెదవి విరుస్తున్నారు.
పుస్తకంలో ఎలాంటి అభ్యంతరకర విషయాలున్నా కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరికలు సైతం చేస్తున్నారు.