కష్టపడింది అయినా…కొట్టుకు వచ్చింది అయినా అనుభవించడానికి అదృష్టం ఉండాలి అంటారు… అయితే హంతకుల విషయంలో…స్మగ్లర్స్ విషయంలో మాత్రం నిజంగా వారికి అదృష్టం చాలానే ఉంది అని చెప్పాలి.గతంలో సూరి హంతకుడు భాను సంగతి తీసుకున్నా.
ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ గంగి రెడ్డి సంగతి తీసుకున్న.వారు విదేశాల్లో అనుభవిస్తున్న భోగ భాగ్యాలు.
నిజంగా మన దేశంలో ప్రధాన పదవుల్లో ఉన్న వారు కూడా అనుభవించరేమో అన్న అనుమానం తప్పక కలుగుతుంది.ఇక వివరాల్ళోకి వెళితే.
గంగి రెడ్డి….పోలీసు రైడింగ్ ల పట్టుపడినా కూడా వారి నుంచి చాకచక్యంగా తప్పించుకొని పోయిన ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు.
అతనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో 27 కేసులున్నాయి.మారిషస్, దుబాయ్ మధ్య అతను విజిటింగ్ వీసాలపై తిరిగినట్లు సిఐడి అధికారులు గుర్తించారు.
మనీలాండరింగ్ ద్వారా అతను డబ్బులు సమకూర్చునట్లు భావిస్తున్నారు.అంతర్జాతీయ స్మగ్లర ద్వారా డబ్బులు సమకూర్చుకున్నట్లు అనుమానిస్తున్నారు.
రెండు దేశాల్లోనూ అతను స్మగ్లర్ల ఇళ్లలో ఆశ్రయం పొందినట్లు భావిస్తున్నారు.అతన్ని ఎపికి తీసుకుని వెళ్లేందుకు సిఐడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని ఇంటర్పోల్ అధికారులు మంగళవారం మారిషస్ కోర్టులో హాజరు పరిచారు.మార్చి 2వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
కాగా, గంగిరెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.అది ఈ నెల 26వ తేదీన విచారణకు రానుంది.