గత కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన తమిళనటి, బిగ్ బాస్ ఫేమ్ యాషికా ఆనంద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు మనకు తెలిసిందే.అతి వేగంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన యాషికా ఆనంద్ ను చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.తాజాగా ఈమె కోలుకున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడం చేత యాషికా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.డిశ్చార్జ్ అయిన ఈ నటి తన ఇంటికి వెళ్ళకుండా తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి అక్కడే ఉంటుంది.
వృత్తి పరంగా తన స్నేహితురాలు నర్సు కావడంతో తన ఇంటిలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే యాషికా ఆనంద్ మాట్లాడుతూ.ఈ ప్రమాదంలో తన స్నేహితురాలు మరణం తనను ఎంతగానో వేధించిందని తెలిపింది.
ఈ ప్రమాదంలో తన స్నేహితురాలు మరణించడానికి కారణం తనేనని, తన మరణం ఎంతగానో కృంగ తీసిందని తెలిపారు.అదేవిధంగా తన కాలికి 3 ఆపరేషన్లు జరిగాయని.ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.
అయితే ఆస్పత్రి నుంచి సరాసరి తన ఇంటికి వెళ్లడంతో అక్కడ తన స్నేహితురాలి జ్ఞాపకాలే గుర్తుకు వస్తాయని అందుకోసమే మరొక స్నేహితురాలి ఇంటికి వచ్చానని యాషికా తెలిపారు.కేవలం అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని విచారణలో తేలడంతో పోలీస్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి ఈమె పై కేసు నమోదు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈమె పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాలని పోలీసులు భావిస్తున్నారు.