పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాధేశ్యామ్’.ఎన్నో రోజుల నుండి డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక ఎట్టకేలకు ఎప్పుడా ఎప్పుడా అంటూ ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముహూర్తం కుదిరింది.ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి విడుదల చేయబోతున్నారు.
ఇక విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు చిత్ర యూనిట్.ఇది ఇటలీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ.ఈ ప్రేమ కథకు అద్బుతమైన గ్రాఫిక్స్ యాడ్ చేసి టీజర్ ను వదలడంతో ఈ సినిమా అన్ని ప్రేమ కథల లాగా మాములుగా ఉండదని అందరికి అర్ధం అయ్యింది.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు.
ఈ మధ్యనే విడుదల అయినా ”ఈ రాతలే” సాంగ్ అందరిని ఆకట్టుకుంది.ముఖ్యంగా ఈ పాట కోసం ఉపయోగించిన గ్రాఫిక్స్ ఇంకా బాగా ఆకట్టుకున్నాయి.
ఇక ప్రభాస్, పూజా మధ్య రొమాన్స్ అద్భుతంగా వచ్చిందని టాక్.మరి ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో ఈ సినిమాను చూడాలా అని వీక్షకులు ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ప్రభాస్ స్టామినా ఎంతో అందరికి అర్ధం అవుతుంది.ఈ సినిమాను నార్త్ లో నెవర్ బిఫోర్ అనే స్థాయిలో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.బాహుబలి, సాహో సినిమాలతో అక్కడి హీరోలను సైతం ఆశ్చర్య పోయేలా చేసిన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాతో మరొక మెట్టు పైకి ఎక్కాడు.
ఈ సినిమాను నార్త్ లో అక్షరాలా 3, 500 స్క్రీన్ లలో విడుదల చేయడానికి అక్కడి డిస్టిబ్యూటర్స్ బుక్ చేశారట.మరి ఇంత పెద్ద స్థాయిలో ఇప్పటి వరకు సౌత్ సినిమాలు విడుదల అవ్వలేదు.
దీంతో డార్లింగ్ ప్రభాస్ రేంజ్ అంటే ఇది కదా అని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు.