టీటీడీ చరిత్రలో జులైలో శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది.జులై నెలలో 23.40లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.స్వామివారి హుండీ ఆదాయం రూ.139.33 కోట్లు సమకూరింది.ఈ నెలలోనే 1.07 కోట్ల శ్రీవారి లడ్డూలు విక్రయించారు.10.97లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు.జూన్లో హుండీ ఆదాయం కాస్త తగ్గినప్పటికీ, మే నెలలో రికార్డుగా ఉన్న రూ.130.29 కోట్లను జూలైలో దాటేసింది.
తాజా వార్తలు